రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి-- ర్యాకల శ్రీశైలం
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏప్రిల్ 23, 24, 25వ తేదీలో నిర్వహించే రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలకు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం బొమ్మలరామారం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం కోరారు ఆదివారం మండల కేంద్రంలో రైతు సంఘం మహాసభల ప్రచార కర పత్రాలను నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీల విత్తనాల దిగుమతులను నిలిపివేసి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు 2021లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఈనెల 20, 21వ తేదీల్లో గ్రామాలో మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిరసనలు నిర్వహించి రైతు సంఘం జెండాలను ఆవిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు దేశెట్టి సత్యనారాయణ, ముక్యర్ల పున్నమ్మ, సునీత, సత్యనారి తదితరులు పాల్గొన్నారు