BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 02:17 PM
28 వీక్షణలు

రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ

తొర్రూరులో రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి .

పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయ పనులకు ఉపయోగపడే యంత్రాలను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.రైతుల శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ యంత్రాల వినియోగంతో సమయం ఆదా అవడంతో పాటు ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్మికుల కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో యంత్రాల వినియోగం అత్యవసరమని చెప్పారు.

మండలంలోని చిన్న, మధ్య తరగతి రైతులు ఈ యంత్రాల ద్వారా ఎక్కువగా లాభపడతారని, రైతులు సమిష్టిగా ఉపయోగించుకునే విధంగా యంత్రాలను సంరక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యంత్రాలు అందుకున్న రైతులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు..