www.ntodaynews.com
బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం
తెలంగాణ
బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం
అవాస్తవ ప్రచారాలు చేయొద్దు: ఈవో ఏకాంబరం స్పష్టం
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామంలో వెలసిన మహిమాన్విత శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే రాహుకాల అభిషేక పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు రాహుకాల పూజ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకే సామాజిక మాధ్యమాల్లో 210 మంది భార్యాభర్తల జంటలు అభిషేక పూజలో పాల్గొన్నట్లు అవాస్తవ సమాచారం ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు.
వాస్తవంగా ఈరోజు అభిషేక పూజలో కేవలం 10 జంటలు మాత్రమే పాల్గొన్నాయని స్పష్టం చేశారు. బోయకొండ గంగమ్మ ఆలయానికి సంబంధించిన సమాచారం ప్రచురించే ముందు తప్పనిసరిగా ఆలయ అధికారుల వద్ద ధృవీకరించుకోవాలని, ఎలాంటి అవాస్తవాలు ప్రచారం చేయరాదని ఆయన సూచించారు.
#BoyakondaGangamma
#TempleNews
#RahukalaAbhishekam
#TempleAdministration
#FakeNewsAlert
#AndhraPradesh
#AnnamayyaDistrict
#DevotionalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube