రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం
రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం, 156వ లెనిన్ జయంతి ఘనంగా నిర్వహణ
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం, 156వ లెనిన్ జయంతిని ముసునూరు మండలంలోని రమణక్కపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ, "పార్టీ తన 57 సంవత్సరాల ప్రయాణంలో ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించింది. లెనిన్ జయంతిని పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని" అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీ వ్యతిరేకం కాదని, కానీ పార్లమెంట్లో 131 డీ లిమిటేషన్ బిల్లు ఓడిపోయిన తర్వాత, బిజెపి, వైసిపి కలిసి ఈ బిల్లును అడ్డుకున్నారని ఆక్షేపించారు. "ఈ విధంగా వామపక్షాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి," అని స్పష్టం చేశారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడం కోసం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధానాన్ని విమర్శించారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా, ఎన్డీఏ పాలకులు వాయిదా వేసినట్టు ఆరోపించారు. "ప్రధానితో సమీక్షలు జరపకుండా, సమాజంపై నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారని" వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు
ఈ కార్యక్రమంలో పల్లె పాము భవాని, వేముల చంటి, ఆమదాల చినబాబు, వేముల మహాలక్ష్మి, నంది పాము రాణి, ఆముదాల వెంకటేశ్వరరావు, ఆముదాల రాజా, ఆముదాల కాసులు, ఆముదాల బాబురావు, ఆముదాల ధనమ్మ, ఆముదాల అన్నపూర్ణ, గాలంకి జయమ్మ, ఆముదాల దావీదు ధారా బేబిషాలిని పాల్గొన్నారు.