BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

రూ.1,500 కోట్ల భూమి కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 06:05 PM
84 వీక్షణలు

హైదరాబాద్ సమీపంలోని గండిపేట్ భూకుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

రూ.1,500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు రెవెన్యూ రికార్డులను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్రహ్మ నాయుడు నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

తమిళనాడులోని కాంచీపురంలో ఆయనను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు, అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

గండిపేట్ ల్యాండ్ స్కాం కేసులో భూముల యాజమాన్యానికి సంబంధించిన పత్రాల తారుమారు, నకిలీ రికార్డుల సృష్టి అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.