www.ntodaynews.com
రూ.1,500 కోట్ల భూమి కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ సమీపంలోని గండిపేట్ భూకుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
రూ.1,500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు రెవెన్యూ రికార్డులను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్రహ్మ నాయుడు నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు.
తమిళనాడులోని కాంచీపురంలో ఆయనను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు, అనంతరం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
గండిపేట్ ల్యాండ్ స్కాం కేసులో భూముల యాజమాన్యానికి సంబంధించిన పత్రాల తారుమారు, నకిలీ రికార్డుల సృష్టి అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.