BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

రూ.20.46 లక్షల విలువైన ఎర్రచందనం సరుకు పట్టివేత

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 05:39 AM
6 వీక్షణలు

రూ.20.46 లక్షల విలువైన ఎర్రచందనం సరుకు పట్టివేత

కల్లూరులో భారీ ఎర్రచందనం స్వాధీనం

కల్లూరు పోలీసుల అప్రమత్తతతో భారీ ఎర్రచందనం అక్రమ రవాణా యత్నం భగ్నమైంది. శుక్రవారం ఉదయం కల్లూరు ఎస్‌ఐకి అందిన ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు బీసీ కాలనీ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు.

ఉదయం సుమారు 9 గంటల సమయంలో TS07 KC 5074 నంబర్ గల టయోటా ఇటియోస్ కారును తనిఖీ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, వాహన డ్రైవర్ పోలీసులను గమనించి కొంత దూరంలో వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు వాహనాన్ని పరిశీలించగా అందులో 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను తూకం వేయగా వాటి మొత్తం బరువు 358 కిలోగ్రాములుగా తేలింది. ఎర్రచందనం విలువ సుమారు రూ.16,46,800 కాగా, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.20,46,800గా నిర్ధారించారు.

ఈ ఘటనపై కల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.