BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

రూ.20.46 లక్షల విలువైన ఎర్రచందనం సరుకు పట్టివేత

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 05:39 AM
62 వీక్షణలు

రూ.20.46 లక్షల విలువైన ఎర్రచందనం సరుకు పట్టివేత

కల్లూరులో భారీ ఎర్రచందనం స్వాధీనం

కల్లూరు పోలీసుల అప్రమత్తతతో భారీ ఎర్రచందనం అక్రమ రవాణా యత్నం భగ్నమైంది. శుక్రవారం ఉదయం కల్లూరు ఎస్‌ఐకి అందిన ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు బీసీ కాలనీ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు.

ఉదయం సుమారు 9 గంటల సమయంలో TS07 KC 5074 నంబర్ గల టయోటా ఇటియోస్ కారును తనిఖీ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, వాహన డ్రైవర్ పోలీసులను గమనించి కొంత దూరంలో వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు వాహనాన్ని పరిశీలించగా అందులో 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను తూకం వేయగా వాటి మొత్తం బరువు 358 కిలోగ్రాములుగా తేలింది. ఎర్రచందనం విలువ సుమారు రూ.16,46,800 కాగా, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.20,46,800గా నిర్ధారించారు.

ఈ ఘటనపై కల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.