BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

రూ.45 లక్షల బంగారం దొరికినా ఆశపడలేదు.. తిరుపతి హోటల్ క్యాషియర్ నిజాయతీకి సెల్యూట్!

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:31 PM
105 వీక్షణలు

 తిరుపతిలో అరుదైన నిజాయతీకి నిదర్శనంగా నిలిచిన ఘటన అందరి ప్రశంసలు అందుకుంటోంది. బెంగళూరుకు చెందిన భరత్‌కుమార్ కుటుంబం తిరుమల దర్శనం, వివాహ కార్యక్రమం ముగించుకుని వెళ్తూ జూపార్కు రోడ్డులోని గరుడాద్రి హోటల్‌లో భోజనం చేసింది. అయితే తొందరలో ఏకంగా 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్‌బ్యాగ్ అక్కడే మర్చిపోయింది.

బెంగళూరు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితులు వెంటనే డయల్ 112కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హోటల్‌కు చేరుకోగా, అక్కడి క్యాషియర్ శశి తన వద్ద భద్రంగా ఉంచిన బ్యాగ్‌ను ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పోలీసులకు అప్పగించారు 

ఆ బ్యాగ్‌లో సుమారు రూ.45 లక్షల విలువైన పెళ్లి నగలు ఉండటంతో బాధిత కుటుంబం ఊపిరి పీల్చుకుంది. "నగలు దొరకకపోయి ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం" అంటూ క్యాషియర్ శశికి భరత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అసాధారణ నిజాయతీని గుర్తించిన పోలీసులు శశిని జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, "నిజాయతీ అనేది మనిషి సంపాదించే అత్యంత విలువైన ఆస్తి" అని కొనియాడారు.

ప్రలోభాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన క్యాషియర్ శశి... సమాజానికి ఆదర్శంగా నిలిచారు