BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

రూ.45 లక్షల బంగారం దొరికినా ఆశపడలేదు.. తిరుపతి హోటల్ క్యాషియర్ నిజాయతీకి సెల్యూట్!

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:31 PM
183 వీక్షణలు

 తిరుపతిలో అరుదైన నిజాయతీకి నిదర్శనంగా నిలిచిన ఘటన అందరి ప్రశంసలు అందుకుంటోంది. బెంగళూరుకు చెందిన భరత్‌కుమార్ కుటుంబం తిరుమల దర్శనం, వివాహ కార్యక్రమం ముగించుకుని వెళ్తూ జూపార్కు రోడ్డులోని గరుడాద్రి హోటల్‌లో భోజనం చేసింది. అయితే తొందరలో ఏకంగా 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్‌బ్యాగ్ అక్కడే మర్చిపోయింది.

బెంగళూరు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితులు వెంటనే డయల్ 112కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హోటల్‌కు చేరుకోగా, అక్కడి క్యాషియర్ శశి తన వద్ద భద్రంగా ఉంచిన బ్యాగ్‌ను ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పోలీసులకు అప్పగించారు 

ఆ బ్యాగ్‌లో సుమారు రూ.45 లక్షల విలువైన పెళ్లి నగలు ఉండటంతో బాధిత కుటుంబం ఊపిరి పీల్చుకుంది. "నగలు దొరకకపోయి ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం" అంటూ క్యాషియర్ శశికి భరత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అసాధారణ నిజాయతీని గుర్తించిన పోలీసులు శశిని జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, "నిజాయతీ అనేది మనిషి సంపాదించే అత్యంత విలువైన ఆస్తి" అని కొనియాడారు.

ప్రలోభాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన క్యాషియర్ శశి... సమాజానికి ఆదర్శంగా నిలిచారు