www.ntodaynews.com
రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ...
జాతీయం
భారత వాతావరణ శాఖ ఐఎండీ నైరుతి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసింది. రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వెల్లడించింది.
మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్ర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సాధారణ సమయానికి ముందుగానే రుతుపవనాల కదలికలు ప్రారంభమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ నెలాఖరులోపే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల పురోగతిపై రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.