www.ntodaynews.com
సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ఆంధ్రప్రదేశ్
/
కాకినాడ
సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
కాకినాడ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో డిఇ శశిధర్ రూ.10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి శశిధర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను అధికారులు విచారిస్తున్నారు.
ఈ ఘటనతో సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగింది. ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.