సేవకు గుర్తింపు… విస్సన్నపేట కానిస్టేబుల్ వంశీకృష్ణకు కేంద్ర పురస్కారం!
సేవకు గుర్తింపు… విస్సన్నపేట కానిస్టేబుల్ వంశీకృష్ణకు కేంద్ర పురస్కారం!
విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మొగులూరి వంశీకృష్ణ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కులమతాలకు అతీతంగా సేవలు అందించి మంచి పేరు సంపాదించారు. విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల సమస్యల పట్ల స్పందనతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం “ఉత్తిష్ట సేవ పథకం”కు ఎంపిక చేయడం స్థానికంగా గర్వకారణంగా మారింది. ఈ ఎంపికతో పోలీస్ శాఖలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు దక్కినట్లైంది.
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ఈ గౌరవం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత కట్టుదిట్టంగా సేవలు అందిస్తానని చెప్పారు.
వారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని స్థానికులు, సహచరులు ఆకాంక్షిస్తూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.