BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

​సైబర్ క్రైమ్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై మధుసూదన్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 05:54 PM
57 వీక్షణలు

పాత మంచిర్యాల 14వ డివిజన్‌లో ఘనంగా వార్డు సభ 

​• డివిజన్ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు

​• పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కార్పొరేటర్ తుమ్మల నరేష్

యువత సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) మధుసూదన్ పిలుపునిచ్చారు. పాత మంచిర్యాలలోని 14వ డివిజన్‌లో కార్పొరేటర్ తుమ్మల నరేష్ అధ్యక్షతన గురువారం వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై మధుసూదన్ మాట్లాడుతూ, సాంకేతికత పెరుగుతున్న నేటి రోజుల్లో యువత సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, ఉన్నత ఆశయాలతో సమాజంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

​డివిజన్ సమస్యలపై చర్చ:

ఈ వార్డు సభలో స్థానిక ప్రజలు తమ డివిజన్ పరిధిలోని పలు సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

​అభివృద్ధిలో భాగస్వాములు కావాలి:

సభకు అధ్యక్షత వహించిన 14వ డివిజన్ కార్పొరేటర్ తుమ్మల నరేష్ మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతకు ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి వార్డు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు