సీఎంఆర్ఎఫ్ ద్వారా బూరుగుగూడెం గ్రామానికి చెందిన నాగబాబుకు ఆర్థిక సాయం
సీఎంఆర్ఎఫ్ ద్వారా బూరుగుగూడెం గ్రామానికి చెందిన నాగబాబుకు ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన చిమటా నాగబాబుకు ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.36,500 విలువైన చెక్కును మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ కార్యక్రమం బూరుగుగూడెం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, టీడీపీ నేత ఈడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు నాగబాబు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పార్థసారథి, మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు రామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.