BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

​సింగరేణి విశ్రాంత ఉద్యోగుల బ్యాంక్ ప్రమాద బీమాపై ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jul, 2026 - 08:05 PM
220 వీక్షణలు

​​సింగరేణి విశ్రాంత ఉద్యోగుల బ్యాంక్ ప్రమాద బీమాపై ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి

మంచిర్యాల: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తరహాలోనే యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు, కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ. 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా చొరవ చూపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. మంగళవారం సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో ఎంపీని కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. యూనియన్ బ్యాంకులో ఖాతాలు ఉన్న బొగ్గు గని పెన్షనర్లందరికీ ఈ బీమా సౌకర్యం వర్తింపజేసేలా బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడాలని వారు కోరారు.

​ఈ వినతిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తక్షణమే సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై హైదరాబాద్, న్యూఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడి, ఎస్బీఐ మాదిరిగానే యూనియన్ బ్యాంకులోనూ విశ్రాంత ఉద్యోగులకు రూ. 50 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం లభించేలా తప్పకుండా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. తమ సమస్యపై త్వరగా స్పందించిన ఎంపీ వంశీకృష్ణకు విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు