సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సాధన సన్నాహక సమావేశం
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సాధన సన్నాహక సమావేశం
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సవరణ మరియు కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ పెంపుదల డిమాండ్లతో ఈనెల 30న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహించ తలపెట్టిన భారీ ధర్నాకు మద్దతుగా, ఈనెల 26వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ (డివిజన్ 51, రోడ్ నెం. 4) లో కీలక సమావేశం జరగనుంది. గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, కార్యదర్శి కొక్కిస రాజగౌడ్, మరియు నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ భేటీలో బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, నస్పూర్, గోలేటి ఏరియాల విశ్రాంత ఉద్యోగులు పాల్గొని, ఢిల్లీ ధర్నాకు సంఘీభావం తెలిపేలా కార్యాచరణ రూపొందించనున్నారు. వయోభారం లేదా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఢిల్లీ వెళ్లలేని వారు మార్చి 30న తమ నివాస ప్రాంతాల్లోని పార్కులు లేదా కమ్యూనిటీ హాల్స్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలు తెలిపి, ఆ ఫోటోలు, వీడియోలను అసోసియేషన్ వారికి పంపాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.