BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

సలేశ్వరం జాతర భద్రత ఏర్పాట్లను సమీక్షించిన జోగులాంబ జోన్ డి ఐ జి -ఎల్. ఎస్.చౌహన్.

తెలంగాణ
/ నాగర్ కర్నూల్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
04 Apr, 2026 - 08:59 AM
26 వీక్షణలు

సలేశ్వరం జాతర భద్రత ఏర్పాట్లను సమీక్షించిన జోగులాంబ జోన్ డి ఐ జి -ఎల్. ఎస్.చౌహన్.

 భద్రత ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ను ప్రశంసించారు.

 లోయలో జారిపడ్డ వ్యక్తిని క్షేమంగా పైకి తీసుకువచ్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు.

శుక్రవారం ఉదయం జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ సలేశ్వరం జాతరలో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ.డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జోగులంబ జోన్ డిఐజి ఎల్ ఎస్ చౌహన్  మాట్లాడుతూ సలేశ్వరం జాతరలో భారీ బందోబస్తు ఏర్పాటు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే స్పందించే విధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ గురించి, ట్రాఫిక్ నియంత్రణ గురించి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పాయింట్స్ మరియు భద్రత ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేస్తూ విధుల పట్ల సిబ్బంది చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించారు.    

సలేశ్వరం జాతర బందోబస్తు ఏర్పాటు గురించి జిల్లా ఎస్పీని ప్రత్యేకంగా అభినందించారు. 

అదేవిధంగా గురువారం రాత్రి నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబుమియా కాలు జారి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు, అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై మురళి, కానిస్టేబుల్స్ ఊర్మిళ, మాణిక్యం వెంటనే గమనించి అతనిని తమ భుజాలపై మోసుకొని గట్టు పైకి తీసుకొచ్చి ఆసుపత్రిలో వైద్యం అందించడంపై కానిస్టేబుల్స్ ని ప్రశంసించారు. ఇలాగే సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.