BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

సూరంపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు…

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 05:54 PM
139 వీక్షణలు

సూరంపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు… గ్రామానికి దారి మూసుకుపోతుందన్న ఆందోళన

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో పంచాయతీ స్థలం ఆక్రమణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామానికి చెందిన గుడిమళ్ల బ్రహ్మయ్య తన ఇంటి ప్రహరీ నిర్మాణంలో భాగంగా పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి, ఎస్సీ కాలనీకి వెళ్లే సిమెంట్ రోడ్డుకు ఆనించి నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ నిర్మాణం కారణంగా సూరంపాలెం ఎస్సీ కాలనీకి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సుమారు 1500 జనాభా గల గ్రామానికి ప్రధాన దారి మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మర్సకట్ల శ్రీనివాసరావు సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ఎండిఓకి అర్జీ సమర్పించారు. అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీని వెంటనే తొలగించాలని, లేదంటే గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పంచాయతీ స్థలాన్ని కాపాడడంతో పాటు గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.