BREAKING
నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
www.ntodaynews.com

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: జగన్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 10:46 PM
6 వీక్షణలు

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: జగన్

ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్యలు.. నేతలకు దిశానిర్దేశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ బల ప్రయోగానికి దిగే అవకాశం ఉందని ఆరోపించిన జగన్.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని జగన్ ఆరోపించారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు పెరిగిపోయాయని విమర్శించారు. గంజాయి రవాణా వ్యవహారాల్లో పోలీసుల ప్రమేయం బయటపడిందని ఆరోపణలు చేశారు.

రాజమహేంద్రవరంలో జరిగిన ప్రియాంక హత్య ఘటనపై స్పందించిన జగన్.. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. పోలీసులు, అధికార పార్టీ నేతలు కలిసి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

హామీలు అమలు చేయలేదని ఆరోపణ

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు ఏ వర్గం కూడా సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు.

రెండేళ్లలోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆదరణ పెరుగుతోందని చెప్పారు.

మరో ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తానని, ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయని జగన్ పేర్కొన్నారు. ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తూ.. ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.