www.ntodaynews.com
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. టీడీపీ నేత చింతం విష్ణుమూర్తి హర్షం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బీసీ నాయకులు చింతం విష్ణుమూర్తి హర్షం వ్యక్తం చేశారు.
క్యాబినెట్ నిర్ణయం బీసీ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరిగేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు.
బీసీల సంక్షేమం, అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్గానికి చింతం విష్ణుమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.