జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్
ప్రత్తిపాటి పుల్లారావును మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ సెక్రెటరీ మస్తాన్ వలి, పట్టణానికి చెందిన జర్నలిస్టులు
NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా...
చిలకలూరిపేట :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ షేక్ మస్తాన్ వలి, పట్టణంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో కలసి సోమవారం నాడు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మస్తాన్ వలినీ ప్రత్తిపాటి పుల్లారావు శాలవతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటి, టిడిపి సీనియర్ నాయకులు తేళ్ల సుబ్బారావు ల తో పాటు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు అడపా అశోక్ కుమార్, ఎన్.వి.ఎస్.ప్రసాద్. అలపాటి ఆంజనేయులు, శ్రీకాంత్, కుప్పం కళ్యాణ్ చక్రవర్తి, సుభాని, కోటేశ్వరావు, శివ, రవి మరియు చిలకలూరిపేట కార్యదర్శి దరియా వలి, జర్నలిస్టులు దాసు, నాగరాజు కొచ్చర్ల చందు, ఎన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube