శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు జగన్ అభినందనలు
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు జగన్ అభినందనలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
డిప్యూటీ ఛైర్మన్ పదవికి తనకు అవకాశం కల్పించినందుకు మాధవరావు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పదవికి గౌరవం తీసుకొచ్చేలా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి జగన్ను కలిసిన మాధవరావును ఈ సందర్భంగా జగన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలి డిప్యూటీ ఛైర్మన్గా ఆయన విజయవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
అనంతరం వైఎస్సార్సీపీకి చెందిన శాసనమండలి సభ్యులు కూడా జగన్ను కలిశారు. తూమాటి మాధవరావు డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ఆయనకు ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.