www.ntodaynews.com
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా తూమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా తూమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధికారికంగా ప్రకటించారు.
డిప్యూటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తూమాటి మాధవరావును ఛైర్మన్ మోషేన్ రాజు స్వయంగా సీటులో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు తూమాటి మాధవరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా తూమాటిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
డిప్యూటీ ఛైర్మన్గా తనకు అవకాశం కల్పించినందుకు తూమాటి మాధవరావు కృతజ్ఞతలు తెలిపారు. మండలి గౌరవాన్ని కాపాడుతూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.