BREAKING
నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
www.ntodaynews.com

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:58 PM
7 వీక్షణలు

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను మండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు అధికారికంగా ప్రకటించారు.

డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తూమాటి మాధవరావును ఛైర్మన్‌ మోషేన్‌ రాజు స్వయంగా సీటులో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు తూమాటి మాధవరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా తూమాటిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

డిప్యూటీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు తూమాటి మాధవరావు కృతజ్ఞతలు తెలిపారు. మండలి గౌరవాన్ని కాపాడుతూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.