www.ntodaynews.com
శివాపురం శివాలయంలో బాణాలింగ ప్రతిష్ట
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
శివాపురం శివాలయంలో బాణాలింగ ప్రతిష్ట – పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి మండలం శివాపురం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బాణాలింగ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేదమంత్రాల నడుమ అర్చకులు నిర్వహించిన ప్రతిష్ట కార్యక్రమం ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శివుని కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, నియోజకవర్గం అభివృద్ధి దిశగా మరింత పురోగమించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.