BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

శివాపురం శివాలయంలో బాణాలింగ ప్రతిష్ట

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 09:00 PM
44 వీక్షణలు

శివాపురం శివాలయంలో బాణాలింగ ప్రతిష్ట – పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్

చింతలపూడి మండలం శివాపురం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బాణాలింగ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేదమంత్రాల నడుమ అర్చకులు నిర్వహించిన ప్రతిష్ట కార్యక్రమం ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శివుని కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, నియోజకవర్గం అభివృద్ధి దిశగా మరింత పురోగమించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.