www.ntodaynews.com
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రాహుకాల అభిషేకానికి విశేష స్పందన లభించింది ఉదయాన్నే బోయకొండ గంగమ్మకు వివిధ రకాల జలాలతో అభిషేకించి అలంకరణ చేశారు. అనంతరం దంపతుల సమక్షంలో రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపరంగా నిర్వహించారు. రాహుకాల అభిషేకం చేయడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందన్న నమ్మకంతో నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. అనంతరం పాత కళ్యాణ కట్ట వద్ద భక్తులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం అధికార సిబ్బంది భక్తులకు మౌలిక వసతులు సమకూర్చారు.