పుంగనూరులో ఘనంగా శక్తి నారాయణి అమ్మ జన్మదిన వేడుకలు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
వారాహి నారాయణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
వారాహి నారాయణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వ్యవస్థాపకురాలైన శక్తి నారాయణి అమ్మ 50వ జయంతి వేడుకలను పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో వారాహి నారాయణి ఫౌండేషన్ ఫౌండర్ హేమంత్ రాయల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే ఫౌండేషన్ ద్వారా అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శివ రాయల్, చెక్కల మంజునాథ్, లోకేష్ రాయల్, భార్గవ్, మయూరి, రామకృష్ణ, పూల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube