శ్రీ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం లో నూతన కార్యవర్గ ఎన్నిక
శ్రీ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం లో నూతన కార్యవర్గ ఎన్నిక
చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని 9 వ వార్డు లో గల శ్రీ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం లో మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ను ఎన్నుకోవడం జరిగింది. దేవాలయ నూతన అధ్యక్షులు గా ముత్యాల భూపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు గా కొలను రాందాస్, ప్రధాన కార్యదర్శి గా పోలోజు శ్రీనివాస చారీ లను ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ నూతనం గా ఎన్నుకోబడిన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ, దేవాలయ అభివృద్ధికి అందరు కృషి చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, 19 వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, 10 వ కౌన్సిలర్ దేపరాజు, 20 వ వార్డు కౌన్సిలర్ హన్ను భాయ్, మాజీ కౌన్సిలర్ దండ అరుణ్ కుమార్, బీజేపీ నాయకులు చెరుకు శివ కుమార్ గౌడ్, ధర్మకర్తలు నామని వీరేశం, ఉప్పు ఆంజనేయులు మరియు ముత్యాల ప్రభాకర్, బోడిగే బాలకృష్ణ, గంటా నాగరాజు, సూరకంటి చింటూ, గజ్జెల రాజు తదితరులు పాల్గొన్నారు.