www.ntodaynews.com
శ్రీరామనవమి పురస్కరించుకుని ఆలయానికి పట్టు వస్త్రాల సమర్పణ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
శ్రీరామనవమి పురస్కరించుకుని ఆలయానికి పట్టు వస్త్రాల సమర్పణ
మంచిర్యాల:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు తన స్వగ్రామమైన పాత మంచిర్యాలలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
బుధవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన, ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలను అందజేస్తూ.. స్వామివారి కళ్యాణోత్సవానికి వీటిని వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు