శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి సందర్శనం
శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి సందర్శనం
మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్రకు ఘన ఏర్పాట్లు
మదనపల్లిలో గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న భక్త హనుమాన్ శోభాయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమం మే 9న మధ్యాహ్నం 3 గంటలకు సొసైటీ కాలనీ రామాలయం వద్ద నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పరమ పూజ్యులు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు విచ్చేయనున్నారు. స్వామి వారి ఆశీస్సులతో హిందూ సంస్థలన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.
హనుమాన్ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, హిందూ సద్భావన కమిటీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మరియు హిందూ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కోరింది.
ఈ కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక మదనపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.