BREAKING
అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
www.ntodaynews.com

అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం

తెలంగాణ
15 Feb, 2026 - 02:47 PM
303 వీక్షణలు
గోడిషెలపేటలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోడిషెలపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సంఘం మరియు యువజన సభ్యుల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మఠం విజయకుమార్ శాస్త్రోక్త విధానంలో వేదమంత్రాల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మద్దుల గోపాల్ రెడ్డి, ఎండపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంఘ రమేష్ యాదవ్, గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ తదితరులు హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, శివదీక్ష స్వాములు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణం “ఓం నమః శివాయ” నినాదాలతో మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పద్మశాలి సంఘం మరియు యువజన సభ్యులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు. #MahaShivaratri #TempleFestival #Godishelapet #SpiritualEvent #ShivaParvatiKalyanam #CommunityCelebration Follow us on Website Facebook Instagram YouTube