BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం

తెలంగాణ
15 Feb, 2026 - 02:47 PM
259 వీక్షణలు
గోడిషెలపేటలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోడిషెలపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సంఘం మరియు యువజన సభ్యుల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మఠం విజయకుమార్ శాస్త్రోక్త విధానంలో వేదమంత్రాల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మద్దుల గోపాల్ రెడ్డి, ఎండపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంఘ రమేష్ యాదవ్, గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ తదితరులు హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, శివదీక్ష స్వాములు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణం “ఓం నమః శివాయ” నినాదాలతో మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పద్మశాలి సంఘం మరియు యువజన సభ్యులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు. #MahaShivaratri #TempleFestival #Godishelapet #SpiritualEvent #ShivaParvatiKalyanam #CommunityCelebration Follow us on Website Facebook Instagram YouTube