చేపల చెరువులు నుండి కాలువల్లోకి తోడుతున్న స్లడ్జి , వ్యర్ధాలు తక్షణమే నిలిపివేయాలి
NTODAY NEWS: గొల్లప్రోలు మండల రిపోర్టర్ భోర శివారెడ్డి
కాకినాడ జిల్లాలో చేపలు , రొయ్యల చెరువులు సాగుచేసేవారు మోటార్లను ఉపయోగించి పంట కాలువల్లో స్లడ్జి తోడటం, మురికి నీటిని పంపింగ్ చేయడం వలన కాలువల్లో బురద ఏర్పడి నీటి సామర్థ్యం తగ్గిపోతుంది , వరదల సమయంలో , వర్షాకాలంలో వ్యవసాయ భూములు ముంపు గురవుతున్నాయి. జిల్లాలో పలు గ్రామాల పర్యటనలో రైతులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ స్పందించి తక్షణమే అనధికారిక పంపింగ్ ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఫిషరీస్ డీఎఫ్ఓ వి.కృష్ణ రావుకి సమస్యను వివరించి , ఫిర్యాదు లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాడ డీసీ సనా శ్రీనివాస్ , కాజులూరు డీసీ లకాని కృష్ణ చైతన్య , కరప డీసీ పున్నమంతుల సత్యనారాయణ , డ్రైన్స్ జెఈ వీరబాబు , జెఈ సుబ్రహ్మణ్యం పాల్గున్నారు.
గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ కార్యాలయం
(కాకినాడ జిల్లా , డా . బి ఆర్ అంబెడ్కర్ కోనసీమఅంబెడ్కర్ కోనసీమ జిల్లా , తూర్పు గోదావరి జిల్లా)
పిఠాపురం కార్యాలయం నెంబర్ : 095153 66262...
Follow us on
Website
Facebook
Instagram
YouTube