BREAKING
పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం
www.ntodaynews.com

భూభారతి చట్టంలో రైతుల సమస్యలకు పరిష్కారం

తెలంగాణ
19 Jun, 2025 - 07:58 PM
304 వీక్షణలు
భూభారతి చట్టంలో రైతుల సమస్యలకు పరిష్కారం -- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి మండలం భూ సమస్యలకు రెవెన్యూ సదస్సుల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రోజున భువనగిరి మండలం లో చీమలకొండూరు గ్రామంలో భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొని జరుగుతున్న రెవెన్యూ సదస్సు ను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్బంగా అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు.వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సదస్సులో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.భూ భారతి చట్టం లో రైతుల సమస్య లు తప్పనిసరిగా పరిస్కారం అవుతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube