www.ntodaynews.com
భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష
తెలంగాణ
పాతాళగంగ వద్ద భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సునీల్ షొరాణ్ సమీక్ష
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలోని పాతాళగంగ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.
ఎస్పీ మెట్ల మార్గం ద్వారా స్వయంగా పర్యటిస్తూ సంబంధిత సిబ్బందికి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. మెట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలని, పుణ్యస్నానాల ప్రాంతంలో అధికారులు నిర్ణయించిన భద్రతా పరిమితులను ఎవరూ అతిక్రమించకుండా మైక్ ద్వారా నిరంతరం సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.
బోటు ప్రయాణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బోటు నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణికుడు లైఫ్ జాకెట్ ధరించిన తర్వాతనే బోటులోకి అనుమతించాలని, భక్తుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, నంద్యాల
#Srisailam #Mahashivaratri2026 #PatalaGanga #TempleSecurity #DevoteeSafety #NandyalPolice #BoatSafety #CrowdManagement
Follow us on
Website
Facebook
Instagram
YouTube