BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహణ

తెలంగాణ
05 Mar, 2026 - 09:09 AM
188 వీక్షణలు
శ్రీశైలంలో దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద ఉన్న దత్తాత్రేయ స్వామివారికి గురువారం (05.03.2026) విశేష పూజలు నిర్వహించారు. లోకకల్యాణం కోసం ప్రతి గురువారం దేవస్థానం సేవగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. పూజా కార్యక్రమం ప్రారంభానికి ముందు మహాగణపతి పూజ నిర్వహించి అనంతరం దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపంగా అవతరించిన త్రిమూర్తి రూపమే దత్తాత్రేయ స్వామివారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల క్షేత్రంతో దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక సంబంధం ఉందని విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయుడు తపస్సు చేసినట్లు విశ్వాసం ఉంది. అందువల్ల ఆ వృక్షాన్ని దత్తాత్రేయ వృక్షంగా పిలుస్తారు. దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో గోదావరి తీరంలోని పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా అవతరించినట్లు గురుచరిత్రలో పేర్కొనబడింది. అనంతరం మహారాష్ట్రలోని కరంజి నగరంలో నృసింహ సరస్వతి స్వామిగా జన్మించినట్లు కూడా చెబుతారు. నృసింహ సరస్వతి స్వామి మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించినట్లు గురుచరిత్రలో ప్రస్తావన ఉంది. నృసింహ సరస్వతి స్వామి తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళ గంగలో చేసినట్లు పురాణాల్లో వివరించబడింది. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ చేసిన ప్రకటన) #Srisailam #DattatreyaSwamy #TempleRituals #SpiritualNews #AndhraPradeshTemples #SrisailamTemple #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube