BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహణ

తెలంగాణ
05 Mar, 2026 - 09:09 AM
271 వీక్షణలు
శ్రీశైలంలో దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద ఉన్న దత్తాత్రేయ స్వామివారికి గురువారం (05.03.2026) విశేష పూజలు నిర్వహించారు. లోకకల్యాణం కోసం ప్రతి గురువారం దేవస్థానం సేవగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. పూజా కార్యక్రమం ప్రారంభానికి ముందు మహాగణపతి పూజ నిర్వహించి అనంతరం దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపంగా అవతరించిన త్రిమూర్తి రూపమే దత్తాత్రేయ స్వామివారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల క్షేత్రంతో దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక సంబంధం ఉందని విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయుడు తపస్సు చేసినట్లు విశ్వాసం ఉంది. అందువల్ల ఆ వృక్షాన్ని దత్తాత్రేయ వృక్షంగా పిలుస్తారు. దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో గోదావరి తీరంలోని పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా అవతరించినట్లు గురుచరిత్రలో పేర్కొనబడింది. అనంతరం మహారాష్ట్రలోని కరంజి నగరంలో నృసింహ సరస్వతి స్వామిగా జన్మించినట్లు కూడా చెబుతారు. నృసింహ సరస్వతి స్వామి మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించినట్లు గురుచరిత్రలో ప్రస్తావన ఉంది. నృసింహ సరస్వతి స్వామి తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళ గంగలో చేసినట్లు పురాణాల్లో వివరించబడింది. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ చేసిన ప్రకటన) #Srisailam #DattatreyaSwamy #TempleRituals #SpiritualNews #AndhraPradeshTemples #SrisailamTemple #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube