BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 14 January 2026, 09:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయి

తెలంగాణ
14 Jan, 2026 - 09:20 AM
340 వీక్షణలు

క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయి: డీఎస్పీ శివరాం రెడ్డి

NTODAY NEWS: చిట్యాల క్రీడల వల్ల యువతలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయని నల్గొండ జిల్లా డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో DYFI, SFI ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, క్రీడలు శారీరక–మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. క్రీడలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. నేటి సమాజంలో యువత గంజాయి, డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి దురలవాట్లకు లోనవుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటోందని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులను ఆయన అభినందించారు. పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నార్కెట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, వార్డు మెంబర్ నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అరూరి ప్రణీత్, నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, దేశబోయిన లింగస్వామి, సురకంటి మోహన్ రెడ్డి, దేశబోయిన నరసింహ, బొంతల సాయి ప్రసాద్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, గోలి సాయికిరణ్, కునూరు గణేష్, శ్రీకాంత్, అరూరి పవన్, ఆరూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. #Kabaddi #YouthAndSports #DYFI #SFI #Nalgonda #Chityala #SankrantiSports #SayNoToDrugs #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube