BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయి

తెలంగాణ
14 Jan, 2026 - 09:20 AM
299 వీక్షణలు

క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయి: డీఎస్పీ శివరాం రెడ్డి

NTODAY NEWS: చిట్యాల క్రీడల వల్ల యువతలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయని నల్గొండ జిల్లా డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో DYFI, SFI ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, క్రీడలు శారీరక–మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. క్రీడలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. నేటి సమాజంలో యువత గంజాయి, డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి దురలవాట్లకు లోనవుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటోందని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులను ఆయన అభినందించారు. పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నార్కెట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, వార్డు మెంబర్ నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అరూరి ప్రణీత్, నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, దేశబోయిన లింగస్వామి, సురకంటి మోహన్ రెడ్డి, దేశబోయిన నరసింహ, బొంతల సాయి ప్రసాద్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, గోలి సాయికిరణ్, కునూరు గణేష్, శ్రీకాంత్, అరూరి పవన్, ఆరూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. #Kabaddi #YouthAndSports #DYFI #SFI #Nalgonda #Chityala #SankrantiSports #SayNoToDrugs #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube