www.ntodaynews.com
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి ISO ధ్రువీకరణ
తెలంగాణ
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి ISO ధ్రువీకరణ
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు
బోయకొండ: ఏదైనా సంస్థలో నాణ్యత, భద్రత, సామర్థ్యం, పనితీరును నిర్ధారించడంలో ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ISO) కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవస్థ పనితీరును పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది.
అన్నమయ్య జిల్లా పరిధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి విశేషమైన చరిత్ర ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండపై ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ఆలయం వెలసి ఉంది. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. పుష్పం అడుగుట ద్వారా కోరికలు నివృత్తి కావడం, పంటలకు పట్టిన చీడపీడలను తొలగించేందుకు అమ్మవారి తీర్థం చల్లడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా ప్రసిద్ధి చెందింది.
ప్రస్తుతం ఈ దేవస్థానం ఉప కమిషనర్ హోదాలో భక్తులకు సేవలందిస్తోంది. ఆలయ నమ్మకం, విశిష్టత, హిందూ ధర్మ పరిరక్షణ, వ్యవస్థ పనితీరును గుర్తిస్తూ ఐసీఎల్ (ICL) సంస్థ శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి
-ISO రెన్యూవల్ ధ్రువీకరణ పత్రం
-గోశాల సంరక్షణకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం
మొత్తం రెండు సర్టిఫికెట్లు మంజూరు చేసింది.
ఈ ధ్రువీకరణ పత్రాలను ఆదివారం 25-01-2026 నాడు దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి జే. ఏకాంబరం కు సంస్థ ప్రతినిధులు అందజేశారు.
#BoyakondaGangamma
#ISOCertification
#TempleNews
#DevotionalNews
#AndhraPradesh
#HinduTemples
#ISOStandards
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube