www.ntodaynews.com
వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
తెలంగాణ
ధర్మపురిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
ధర్మపురి క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించారు.
గోదావరి పుష్కరాలకు భారీ నిధులు కేటాయిస్తాం
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ రథోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో తనకు అవకాశం లభించిందని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మపురి అభివృద్ధికి ప్రభుత్వం తరఫున భారీ నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, దేవాలయ కమిటీ సభ్యులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. "గోవిందా.. నరసింహ.." నామస్మరణతో ధర్మపురి పురవీధులు మారుమోగాయి.
#Dharmapuri #LakshmiNarasimhaSwamy #Rathotsavam #AdluriLakshmanKumar #TelanganaNews #TempleFestival #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube