BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
15 Feb, 2026 - 03:01 PM
230 వీక్షణలు
లోత్తునూర్‌లో శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకుడు నర్సింగోజు సాయి చరణ్ చారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దాతల విరాళాలు ఆలయ అభివృద్ధి కోసం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ప్రధాన విరాళాల వివరాలు ఇవీ: డాక్టర్ అంకం లక్ష్మణ్–అరుణ దంపతులు (పార్థ హాస్పిటల్): ఆలయ షెడ్డు నిర్మాణానికి ₹70,000, కమాన్ నిర్మాణానికి ₹1,00,000 విరాళం. గుడికందుల రాజేశం–పుష్పలత దంపతులు (పైడిపల్లి): ధ్వజస్తంభం ఇత్తడి స్థాపన కోసం ₹1,31,000 విరాళం. అంకం రాకేష్–ధరణి: మకర తోరణం నిర్మాణానికి ₹7,000. ఒరగంటి శ్రీకాంత్: అభిషేక సామగ్రి కోసం ₹5,000 ఆర్థిక సాయం. విరాళాలు అందజేసిన దాతలను గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కళ్యాణోత్సవం అనంతరం శివపార్వతుల విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ‘ఓడి బియ్యం’ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube