మైనారిటీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
NTODAY NEWS: హైదరాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గ రిపోర్టర్ పగడాల దేవయ్య
హైదరాబాద్, బాగ్ లింగంపల్లిలోని మైనారిటీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు 32 విద్యార్థినిలకు సరైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మైనారిటీ గురుకులాల్లో ఆహారపదార్థాల నాణ్యతపై నిరంతరం తనిఖీ చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని మైనారిటీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు గురై కింగ్ కోఠీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీ గురుకులాల పట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని, ఆహారం, మౌళిక సదుపాయాలు సరిగా లేకపోవడం వలన, ఆహారం నాణ్యతపై తనిఖీ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అధికారులు అజాగ్రత్తతో పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్ (పాషా), ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రావణ్, కిషన్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube