www.ntodaynews.com
మాదకద్రవ్యాలు నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ
తెలంగాణ
మాదకద్రవ్యాలు నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ
NTODAY NEWS: రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ తీసుకుంటే వచ్చే పరిణామాల పై రామన్నపేట పోలీసులు, ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల మానసిక శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని, విద్యార్థి దశలోనే మాదకద్రవ్యాలు నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్నపేట ఎన్ వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో లాల్ బహదూర్, ఎంపీడీవో రాములు, రామన్నపేట ఎస్సై డి నాగరాజు, వలిగొండ, అడ్డగూడూరు ఎస్సై లు యుగంధర్, వెంకట్ రెడ్డి, జూనియర్ కాలేజ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube