ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమం
NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్
ఏలూరు సత్రంపాడు లోని ఆదిత్య డిగ్రీ కళాశాల మరియు రెడ్ క్రాస్, మానవత సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరచి, పరిశుభ్రత ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వంగ వెంకటేశ్వర రావు హాజరై స్వచ్చత ప్రతి పౌరుని బాధ్యత అని మరియు విద్యార్థులు సామాజిక సేవలో చురుకుగా పాల్గొనడం వల్ల సమాజంలో మార్పు సాధ్యం అవుతుంది అని తెలిపారు. రెడ్ క్రాస్ సభ్యులు ఆలపాటి నాగేశ్వర రావు మరియు మానవత సంస్థ ప్రతినిధులు కార్యక్రమాన్ని సమర్థవంతం గా నిర్వహించడం లో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్, రెడ్ క్రాస్ వాలంటీర్స్ పాల్గొని ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube