BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం సమర్థన – ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 05:22 AM
70 వీక్షణలు

నీట్-యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దేశ భద్రతతో పాటు పరీక్షల సమగ్రతను కాపాడేందుకు అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద తీసుకున్న చర్యలు నిబంధనలకు లోబడే ఉన్నాయని జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం స్పష్టం చేసింది.

‘డార్క్ వెబ్’లా మారిన టెలిగ్రామ్ – కేంద్ర ఆందోళన

కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో టెలిగ్రామ్ యాప్ ఒక కొత్త తరహా ‘డార్క్ వెబ్’గా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. యాప్‌లోని ప్రైవసీ ఫీచర్లు, ఐడెంటిటీ దాచుకునే సదుపాయాల కారణంగా సైబర్ నేరగాళ్లు, పరీక్షల పేపర్ లీక్ ముఠాలు, ఉగ్రవాద అనుబంధ శక్తులు దీన్ని వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ చేసి విక్రయించడం మాత్రమే కాకుండా, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ద్వారా పాత తేదీలతో నకిలీ లీకేజీ ఆధారాలు సృష్టించి విద్యార్థులను మోసం చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

కోర్టు కీలక వ్యాఖ్యలు

నిర్దిష్ట ఛానళ్లను మాత్రమే తొలగించడం సరిపోదని, యాప్ స్థాయిలో తాత్కాలిక చర్య అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జూన్ 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ ముగిసే వరకు (జూన్ 22 వరకు) టెలిగ్రామ్ సేవలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.