BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం సమర్థన – ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 05:22 AM
21 వీక్షణలు

నీట్-యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దేశ భద్రతతో పాటు పరీక్షల సమగ్రతను కాపాడేందుకు అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద తీసుకున్న చర్యలు నిబంధనలకు లోబడే ఉన్నాయని జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం స్పష్టం చేసింది.

‘డార్క్ వెబ్’లా మారిన టెలిగ్రామ్ – కేంద్ర ఆందోళన

కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో టెలిగ్రామ్ యాప్ ఒక కొత్త తరహా ‘డార్క్ వెబ్’గా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. యాప్‌లోని ప్రైవసీ ఫీచర్లు, ఐడెంటిటీ దాచుకునే సదుపాయాల కారణంగా సైబర్ నేరగాళ్లు, పరీక్షల పేపర్ లీక్ ముఠాలు, ఉగ్రవాద అనుబంధ శక్తులు దీన్ని వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ చేసి విక్రయించడం మాత్రమే కాకుండా, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ద్వారా పాత తేదీలతో నకిలీ లీకేజీ ఆధారాలు సృష్టించి విద్యార్థులను మోసం చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

కోర్టు కీలక వ్యాఖ్యలు

నిర్దిష్ట ఛానళ్లను మాత్రమే తొలగించడం సరిపోదని, యాప్ స్థాయిలో తాత్కాలిక చర్య అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జూన్ 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ ముగిసే వరకు (జూన్ 22 వరకు) టెలిగ్రామ్ సేవలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.