www.ntodaynews.com
తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు..
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు.. ఎస్ఐ, కానిస్టేబుల్ పట్టివేత
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
టౌన్ ఎస్ఐ పి. నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం.
ఒక ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడి రూ.70 వేల డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పక్కా సమాచారంతో అధికారులు ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.