BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

తాతయ్య జ్ఞాపకార్థం 50 వేల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 10:30 PM
153 వీక్షణలు

తాతయ్య జ్ఞాపకార్థం 50 వేల విరాళం — ఆలయ అభివృద్ధికి మాగంటి నాని ముందడుగు

నరసాపురంలో దాతృత్వ కార్యక్రమం

విస్సన్నపేట మండలంలోని నరసాపురం శ్రీ సూర్యలక్ష్మీనారాయణ దేవాలయం అభివృద్ధి కోసం టిడిపి యువ నాయకుడు మాగంటి సత్యనారాయణ చౌదరి మనువడు మాగంటి నాని (సత్యనారాయణ చౌదరి) 50,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా మాగంటి నాని మాట్లాడుతూ తమ తాతయ్య జ్ఞాపకార్థం ఆలయ అభివృద్ధికి సహాయం చేయడం తనకు ఎంతో సంతోషకరమని తెలిపారు. తమ కుటుంబం నిత్య దేవతారాధనలో విశ్వసిస్తుందని, తాము సంపాదించిన ఆదాయంలో కొంత భాగాన్ని దైవ కార్యాలకు వినియోగించాలన్నది తన తండ్రి శోభన ప్రసాద్ ఆచరణ అని పేర్కొన్నారు. ఆ ఆశయాలను తాను కొనసాగిస్తున్నానని చెప్పారు.

“మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో ముందుకు సాగితే జీవన మార్గంలో మంచి పరిచయాలు ఏర్పడతాయని, మనం చేసే సేవలే మనకు ఆశీస్సులుగా మారుతాయని నాని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి నాని నానమ్మ సుభాషిణి, బాబాయి ప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారు ఆలయాన్ని దర్శించి ప్రతి దేవతామూర్తులకు పూలమాలలు సమర్పించి, పసుపు కుంకుమలు, జాకెట్ ముక్కలు, పూజా సామాగ్రి అందజేశారు. ఆలయ పూజారులకు కూడా వస్త్రాలు, కానుకలు సమర్పించారు.

ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ మాగంటి కుటుంబం దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు శాలువాలతో సత్కరించి వేద ఆశీర్వాదాలు అందించారు.

ఈ కార్యక్రమం ఘనంగా, భక్తిశ్రద్ధలతో సాగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల సాన్నిధ్యంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.