BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

తాతయ్య జ్ఞాపకార్థం 50 వేల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 10:30 PM
107 వీక్షణలు

తాతయ్య జ్ఞాపకార్థం 50 వేల విరాళం — ఆలయ అభివృద్ధికి మాగంటి నాని ముందడుగు

నరసాపురంలో దాతృత్వ కార్యక్రమం

విస్సన్నపేట మండలంలోని నరసాపురం శ్రీ సూర్యలక్ష్మీనారాయణ దేవాలయం అభివృద్ధి కోసం టిడిపి యువ నాయకుడు మాగంటి సత్యనారాయణ చౌదరి మనువడు మాగంటి నాని (సత్యనారాయణ చౌదరి) 50,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా మాగంటి నాని మాట్లాడుతూ తమ తాతయ్య జ్ఞాపకార్థం ఆలయ అభివృద్ధికి సహాయం చేయడం తనకు ఎంతో సంతోషకరమని తెలిపారు. తమ కుటుంబం నిత్య దేవతారాధనలో విశ్వసిస్తుందని, తాము సంపాదించిన ఆదాయంలో కొంత భాగాన్ని దైవ కార్యాలకు వినియోగించాలన్నది తన తండ్రి శోభన ప్రసాద్ ఆచరణ అని పేర్కొన్నారు. ఆ ఆశయాలను తాను కొనసాగిస్తున్నానని చెప్పారు.

“మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో ముందుకు సాగితే జీవన మార్గంలో మంచి పరిచయాలు ఏర్పడతాయని, మనం చేసే సేవలే మనకు ఆశీస్సులుగా మారుతాయని నాని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి నాని నానమ్మ సుభాషిణి, బాబాయి ప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారు ఆలయాన్ని దర్శించి ప్రతి దేవతామూర్తులకు పూలమాలలు సమర్పించి, పసుపు కుంకుమలు, జాకెట్ ముక్కలు, పూజా సామాగ్రి అందజేశారు. ఆలయ పూజారులకు కూడా వస్త్రాలు, కానుకలు సమర్పించారు.

ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ మాగంటి కుటుంబం దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు శాలువాలతో సత్కరించి వేద ఆశీర్వాదాలు అందించారు.

ఈ కార్యక్రమం ఘనంగా, భక్తిశ్రద్ధలతో సాగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల సాన్నిధ్యంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.