BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 09:25 PM
127 వీక్షణలు

తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి: చాట్ల రాబర్ట్

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో గురువారం కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాట్ల రాబర్ట్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానికంగా తడిసిన ధాన్యాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతాంగానికి నష్టం కలిగించిందని ఆరోపించారు. ఆరబెట్టుకుంటున్న ధాన్యానికి కాటా వేయకపోవడం, ఇప్పటికే కాటా వేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తకపోవడం వల్ల అది తడిసి మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనుక ప్రభుత్వం ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

ఇక ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులు వంద కిలోలకే 4 నుంచి 5 కిలోల తారం అడుగుతున్నారని, దీనిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజాదర్బార్‌లో తారం అవసరం లేదని చెబుతున్నా, స్థానికంగా అధికారులు మాత్రం తారం కోరుతున్నారని రైతులు చెబుతున్నారని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గుడిసె ప్రభాకర్ రెడ్డి, మైలమాల కాంతారావు, మట్ట కొయ్య రాము, పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, ముప్పిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.