BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 09:25 PM
43 వీక్షణలు

తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి: చాట్ల రాబర్ట్

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో గురువారం కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాట్ల రాబర్ట్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానికంగా తడిసిన ధాన్యాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతాంగానికి నష్టం కలిగించిందని ఆరోపించారు. ఆరబెట్టుకుంటున్న ధాన్యానికి కాటా వేయకపోవడం, ఇప్పటికే కాటా వేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తకపోవడం వల్ల అది తడిసి మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనుక ప్రభుత్వం ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

ఇక ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులు వంద కిలోలకే 4 నుంచి 5 కిలోల తారం అడుగుతున్నారని, దీనిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజాదర్బార్‌లో తారం అవసరం లేదని చెబుతున్నా, స్థానికంగా అధికారులు మాత్రం తారం కోరుతున్నారని రైతులు చెబుతున్నారని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గుడిసె ప్రభాకర్ రెడ్డి, మైలమాల కాంతారావు, మట్ట కొయ్య రాము, పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, ముప్పిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.