BREAKING
పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన..
www.ntodaynews.com

​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
18 Apr, 2026 - 02:19 PM
100 వీక్షణలు

​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి

తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక డిమాండ్ - మంచిర్యాలలో నిరసన సమావేశం

​మంచిర్యాల, ఏప్రిల్ 18:

బ్రిటిషర్లు భారత్, పాకిస్థాన్‌ను వేరు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను వేరు చేశారంటూ పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐక్య వేదిక సమావేశంలో ఉద్యమకారులు ఎంపీ తీరుపై నిప్పులు చెరిగారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. 60 ఏళ్ల పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆకలికి, అవమానానికి ఓర్చి, వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్‌తో ముడిపెట్టడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ప్రధాన డిమాండ్లు:

​బేషరతు క్షమాపణ: ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఉద్యమకారులుగా అడ్డుకుంటామని హెచ్చరించారు.

​వ్యాఖ్యల తొలగింపు: పార్లమెంట్ రికార్డుల నుండి ఈ వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను విజ్ఞప్తి చేశారు.

​సస్పెన్షన్: తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్యను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీజేపీ అధినాయకత్వాన్ని డిమాండ్ చేశారు.

​అదేవిధంగా, సభలో తేజస్వి సూర్య మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, రఘునందన రావు కనీసం నోరు మెదపకపోవడంపై ఐక్య వేదిక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వీరు అసలు తెలంగాణ ఉద్యమకారులేనా అని సందేహం వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా బీజేపీ నాయకులు తెలంగాణపై విషం చిమ్మడం మానుకోవాలని, లేదంటే రాష్ట్రంలో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.

​పాల్గొన్నవారు:

ఈ సమావేశంలో ఐక్య వేదిక అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, కార్యదర్శి కస్తూరి సూర్యం, ఉద్యమ నాయకులు బి. ప్రభాకర్, జేడీ బీరయ్య, సిహెచ్. వైకుంఠం, కె. రాజిరెడ్డి, డి. సాయిలు తదితరులు పాల్గొన్నారు