తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం
తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం --బొమ్మలరామారం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడియా లోజన్ నాయక్
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే తీన్మార్ మల్లన్న సారాధ్యంలో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బొమ్మలరామారం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడియా లోజన్ నాయక్ అన్నారు గురువారం బొమ్మలరామారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనే నినాదంతో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామీణ స్థాయి నుంచి రోజురోజుకు రాష్ట్రస్థాయి వరకు విస్తరిస్తుందని ఆయన తెలిపారు స్వతంత్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్న బడుగు బలహీన వర్గాలకు అధికారం అందనీ ద్రాక్ష గానే మిగులుతుందని ఆయన ఆవేదన చెందారు రాష్ట్ర జనాభాలో కనీసం 20 శాతం లేని అగ్రకులాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యమేలుతున్నారని 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లకే పరిమితం అయ్యారు తప్ప అధికారాన్ని అందుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు బొమ్మలరామారం మండలంలో ఎక్కువగా గిరిజన తండాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆలోచించి గిరిజనుడైన తనకు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో టిఆర్పి జిల్లా అధ్యక్షులు కొమ్మిశెట్టి నరసింహులు తో పాటు టిఆర్పి నాయకులు పాల్గొన్నారు