తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం
తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) చిట్యాల మండల మరియు మున్సిపల్ అధ్యక్షుడిగా చిట్యాల పట్టణానికి చెందిన మలి దశ ఉద్యమకారుడు చెకిలంమెట్ల అశోక్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక వ్యవస్థాపక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు చెకిలంమెట్ల అశోక్, తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఈ బాధ్యతలను అప్పగించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నరాల సత్యనారాయణ
ఈ నియామకం సందర్భంగా సంస్థ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన చిట్యాల మండల & మున్సిపల్ అధ్యక్షుడు చెకిలంమెట్ల అశోక్ స్థానికంగా ఉన్న నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన నిజమైన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, సంక్షేమ ఫలాలను అమలు చేసేంత వరకు నిరంతరం పోరాడాలని ఆయన ఆకాంక్షించారు.