BREAKING
ధాన్యం దిగుమతి నిబంధనల ప్రకారమే జరగాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు ద్రావిడ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్ ​చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ బంగారు బాట ​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి చిట్యాలలో రైతు అవగాహన సదస్సు ​ప్రపంచ దేశాలకు ఆదర్శం మన ప్రజాస్వామ్యం బాకీ వివాదం.. వివాహిత హత్య.. పరిశుభ్రమైన రాయచోటి నిర్మాణమే లక్ష్యం తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం ధాన్యం దిగుమతి నిబంధనల ప్రకారమే జరగాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు ద్రావిడ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్ ​చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ బంగారు బాట ​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి చిట్యాలలో రైతు అవగాహన సదస్సు ​ప్రపంచ దేశాలకు ఆదర్శం మన ప్రజాస్వామ్యం బాకీ వివాదం.. వివాహిత హత్య.. పరిశుభ్రమైన రాయచోటి నిర్మాణమే లక్ష్యం తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం
www.ntodaynews.com

తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
30 May, 2026 - 07:10 PM
14 వీక్షణలు

తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం

తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మలి దశ ఉద్యమకారుడు పల్లపు బుద్ధుడిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్‌లు అధికారిక నియామక పత్రాన్ని  జారీ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల  నివాసి అయిన పల్లపు బుద్ధుడు సుదీర్ఘ కాలంగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన నియామకం పట్ల సంస్థ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ​హామీల సాధన కోసం పోరాడాలి ​ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఉన్న నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాల్సిన బాధ్యత కొత్త కమిటీపై ఉందన్నారు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిజమైన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు, అవి అమలు అయ్యేంత వరకు నిరంతరం పోరాడాలని పల్లపు బుద్ధుడికి దిశానిర్దేశం చేశారు. ​తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు పల్లపు బుద్ధుడు సంస్థ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఉద్యమకారులందరినీ ఏకం చేసి, వారి హక్కుల సాధన కోసం నమ్మకంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు ఉద్యమకారులు మరియు స్థానికులు అభినందనలు తెలియజేశారు.