BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

తెలుగు ప్రజలు నందమూరి ఆశయాల కొనసాగించాలని ఆకాంక్షించారు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 11:28 AM
160 వీక్షణలు

పుంగనూరులో పలు ప్రాంతాలలో నందమూరి అభిమానులు స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు 

పుంగనూరు మండలంలో పట్టణ గ్రామీణ ప్రాంతాలు కాకుండా ప్రతి చోట నందమూరి ఆశయాలు ప్రతి ఒక్కరూ సాధించాలంటూ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా పుంగునూరు మండల ముఖ్య నాయకుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నందమూరి అభిమానులకు ఘనంగా సన్మానం చేశారు, నందమూరి తారక రామారావు గారి 103 వ జయంతి కార్యక్రమాలను పుంగనూరు పట్టణం ఎన్టీఆర్ క్లినిక్ నిర్వాహకుడు నందమూరి తారకరామా పేద బడుగుల సేవా సంస్థ అధ్యక్షుడు దుద్యాల అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవ రెడ్డి ఆధ్వర్యంలో చేసిన మహానాడు సందర్భంగా ఏర్పాటు కార్యక్రమంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు,

పట్టణ ప్రాంతమైనటువంటి ట్రావెల్స్ బంగ్లాలో పట్టణ అభివృద్ధి కమిటీ నాయకుడు సివిరెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు, రూరల్ ప్రాంతమైనటువంటి ఈడిగపల్లి వద్ద, భీమనేని రెస్టారెంట్లో సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో ఘనంగా నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు, ఈ విధంగా తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించారు, తరాలు గడిచిన

నందమూరి తారక రాముని నామస్మరణం మొగుతూనే ఉంటుందని, అభిమానులు ఆనందంతో కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల మరియు పట్టణ ప్రాంతాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.