తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల్లో మోరంపూడి శ్రీనివాసరావుకు ఘన సన్మానం
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల్లో మోరంపూడి శ్రీనివాసరావుకు ఘన సన్మానం – పార్టీ సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎంపికైన నలుగురు నాయకుల్లో నూజివీడు నియోజకవర్గానికి చెందిన మోరంపూడి శ్రీనివాసరావు ఒకరుగా నిలిచారు. పార్టీ కోసం అంకితభావంతో కష్టపడి పనిచేసిన నాయకులను సభలో సన్మానించేందుకు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ వీరిని ఎంపిక చేసి పంపింది.
పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి మోరంపూడి శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూజివీడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మోరంపూడి శ్రీనివాసరావు చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. చాట్రాయి మండలానికి చెందిన పలువురు టిడిపి నేతలు మోరంపూడి శ్రీనివాసరావుకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు