తహసిల్దార్ విజయ్ కుమార్ను సన్మానించిన మేడి హరికృష్ణ
తహసిల్దార్ విజయ్ కుమార్ను సన్మానించిన మేడి హరికృష్ణ
నల్గొండ జిల్లా చిట్యాల మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఎం. విజయ్ కుమార్ను బుధవారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. తహసిల్దార్ కార్యాలయంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ మండల అభివృద్ధిలో, పేద ప్రజల భూ సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ చొరవ చూపాలని కోరారు. అలాగే ఆసరా సంస్థ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంజనపెళ్లి శివసాయి, సిరిపంగి నితిన్, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.